Wednesday, May 12, 2010

రాయపాటి వర్సెస్ కన్నా!

గుంటూరు లో కన్నా లక్ష్మి నారాయణ , రాయపాటి సాంబశివరావు ల మధ్య జరుగుతున్న అంతర్యుద్దం నేడు బహిర్గతమయ్యి చిలికి చిలికి పెను తుఫాను గా మారింది నేడు అది రెండు కులాల మధ్య చిచ్చుగా మారింది. ఈ వేడి రాష్ట్రం దాటి కేంద్రానికి పాకింది. గత కొన్ని దశాబ్దాలుగా గుంటూరు జిల్లాను తమ సొంత జాగీరు గా మార్చుకున్న రాయపాటి ఫ్యామిలీకి కన్నా లక్ష్మి నారాయణ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడుగా పదవిని సాధించడమే కాక గుంటూరు జిల్లాలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని ఏర్పరుచుకుని తదనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించడం రాయపాటి వర్గానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఇప్పటి వరకు ఆ వర్గం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఇప్పుడు కన్నా వర్గం క్రమేనా బలపడటం తో ప్రజలలో రాయపాటి వర్గానికి చుక్కెదురైంది. గతం లో కూడా రాయపాటి వర్గీయులు చేసిన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయేది. జయ లక్ష్మి టొబాకో ని అడ్డం పెట్తుకుని ఎంతమంది పుగాకు రైతులను ముంచింది స్తానికులందరికి తెలిసిన విషయమే. ఇదే వ్యాపారాన్ని అడ్డం పెట్తుకుని స్వర్గీయ ఇందిరా గాంధీ మొదలుకుని దివంగత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి గా ఉన్నంత కాలం కేంద్ర పుగాకు బోర్డులో అధ్యక్ష పదవి నుండి వివిధ హోదాలలో పదవులు సంపాదించి వాటి ఆ పరపతి తో తన పుగాకు సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయి లో విస్తరించున్న ఘరానా వ్యక్తి రాయపాటి. ఇతర దేశాలకు పుగాకు ఎగుమతి చేసేందుకు అవసరమైన పుగాకును జిల్లాలోని బక్క రైతుల వద్దనుండి అతి తక్కువ ధరకు పుగాకును కొనుగోలు చేసి ఎందరో రైతులు రోడ్డున పడటానికి కారణమైన మహా ఘనుడు గౌరవ రాయపాటి. అంతేకాకుండా తన పదవులను, పనులను నిరాటంకంగా కొనసాగించేందుకు అడ్డం వచ్చినవారిని సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగ దీసుకునేందుకు అడ్డగా రాయపాటి వారి జయలక్ష్మి గెస్ట్ హవుస్ అన్నడి జగమెరిగిన సత్యం. బహుశా ఇందులోని ప్రతి గోడకు చెవులుంటే అవి చెప్పగలవు రాయపాటి వారి రస లీలలు, అరాచక ఆగడాలను. ఇక వీరి వికృత అరాచక చేష్టలు ఇక్కడితో ఆగితే బాగానే వుండేది కాని మన ఆంధ్రులను అపఖ్యాతి పాలుచేసిన ఘనత కూడా రాయపాటిదే అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పుగాకు విపణిలో సైతం తన దగా కోరు తనాన్ని చాటుకున్న పెద్దమనిషి ఈ రాయపాటే. చైనా లో ని కొందరు అధికారులకు ధనాశ చూపి పుగాకు బ్యారేల్స్ లో పుగాకు తో పాటు ఇతర వ్యర్ధపదార్ధాలను కూర్చి ఎగుమతి చేసిన ఘరానా దొంగ. అప్పట్లో వీరి పుణ్యమాని చైనాలో ఈ విధమైన మోసాలకు పాల్పడి నందులకు అక్కడ షుమారు ముప్పై తొమ్మిది మంది ఉద్యోగస్తులను చైనా ప్రభుత్వం అతి దారుణమైన శిక్షలకు గురి చేసి నట్లు వదంతి. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగినరాయపాటి అంతటి తో ఆగకుండా నేడు తన కుటుంబ సభ్యులన్దరిని రాజకీయాల్లోచొప్పించి వివిధ అధికార పదవులలో కూర్చో పెట్టడమే కాకుండా తన పర భేదం లేకుండా ఖాళీ గా వున్న ప్రభుత్వ స్తలాలనే కాకుండా, ఇతర మతస్తుల సొంత స్తాలాలను ఆక్రమించుకోవడం లో కూడా అగ్రగన్యులే. చెప్పుకుంటూ పొతే రాయపాటి చరిత్ర ఒక మహోద్గ్రన్ధమే. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రాయపాటి నేడు కన్నని విమర్శించడం హాస్యాస్పదం అనిపించుకుంటుంది. అది చాలదన్నట్లు అన్నదమ్ముల్ల కలిసి ఉంటున్న ఇరు కులాల వారిని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలను కోవడ అతని నీచ సంస్కృతీ కి మరో తార్కాణం. ఇప్పటికైనా రాయపాటి తన నీచ రాజకీయాలను వీడక పొతే, అతని నిజ స్వరూపం బట్టబయలు కాకా తప్పదు. ఆ రోజు ఎంతో దూరం లేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది. ఆకాశ మీద వుమ్మలను కోవడం అవివేకమన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తెరిగి ప్రవర్తిస్తే అన్ని విధాల రాయపాటికి శ్రేయస్కరం.

No comments:

Post a Comment